పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan ),రానా దగ్గుబాటి (Rana daggubati )హీరోలుగా టాలీవుడ్ లో వస్తున్న మల్టీ స్టారర్ భీంలా నాయక్ (Bheemla Nayak ).ఈ మూవీ ఫిబ్రవరి 25న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది .ఇక ఈరోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా జరిగింది .రిలీజ్ కు దగ్గరగా ఉన్న పవన్ భీంలా నాయక్ కి శుభవార్త తెలిపింది తెలంగాణ ప్రభుత్వం(Telangana). రెండు వారాల పాటు తెలంగాణలో స్పెషల్ షో వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీనితో పవన్(Pawan kalyan ) అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భీంలా నాయక్ (Bheemla nayak )చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం తన ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. మంత్రి కేటీఆర్(KTR ) కూడా ఫ్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొని సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు .తెలంగాణలో 5షోలు వేసుకునే ఛాన్స్ ఉండడంతో భీంలా నాయక్(Bheemla nayak ) భారీ కలెక్షన్లు రాబట్టే చాన్స్ ఉంది .దాదాపు 110 కోట్లకు పైగా బిజినెస్ చేసిన భీంలా నాయక్ ఏ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.