మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా దిగ్గజ దర్శకుసు శంకర్‌(Shankar) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళ అగ్ర హీరో మోహన్‌ లాల్‌ని(Mohan lal) సంప్రదించగా ఆయన ఈ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేశాడని తెలుస్తోంది. ఈ మూవీలో అవినీతికి పాల్పడే ఓ పేరుమోసిన పొలిటీషియన్ పాత్ర ఉండనుందని సమాచారం.

ఈ పాత్ర కోసం చిత్రబృందం ఆయనను సంప్రదించారట. ఈ పాత్ర కథ విన్న ఆయన సున్నితంగా తిరస్కరించారని సమాచారం. కాగా, ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం అమృత్‌సర్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ ఫైట్‌ కూడా చిత్రీకరించనున్నారని సమాచారం. కాగా, సునీల్, నవీన్‌ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.