కన్నడ స్టార్‌ హీరో యశ్‌ కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ “కేజీఎఫ్‌-2”. నలుగేళ్ల కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

ఈ మూవీలో శ్రీనిధి శెట్టి, ప్రకాశ్‌ రాజ్‌, రవీనా టండన్‌, రావు రమేశ్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా.. రవి బస్రూర్‌ సంగీతం అందించారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం తాజాగా ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసింది. తుఫాన్ అంటూ సాగే ఈ పాట సినిమాలో హీరో పాత్ర గురించే తెలియజేసేలా తీర్చిదిద్దారు మేకర్స్. భారీ అంచనాలతో వస్తున్నా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.