మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’(Acharya) ఇందులో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రామ్‌చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవితో కలిసి రామ్ చరణ్ 25 నిమిషాలు మాత్రమే స్క్రీన్ ను షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులను ఎంతగానో అలరిస్తాయని సమాచారం. ‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 29న విడుదల కానుంది.