సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్‌, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. మ్యూజిక్‌ సెన్సెషన్‌ తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా బ్యాంక్ మోసాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది.

అయితే మే 12న విడుదలకి సిద్దమవుతున్న ఈ సినిమా షూటింగ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఒక్క పాట మినహా, మిగతా షూటింగ్ అంతా పూర్తి అయినట్లు వెల్లడించింది. అలాగే ఈ సినిమా నుండి ఇక వరుస అప్డేట్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం స‌ర్కారు వారి పాట వ‌చ్చే వారం నుంచి ప్రారంభించబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాట‌లకు చక్కటి స్పంద‌న లభించింది. ఈ సినిమా నుంచి మూడో పాట‌ను మరో వారం రోజుల్లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం