మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’(Acharya) ఇందులో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రామ్‌చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది.

కాగా, ఆచార్య మూవీ ట్రైల‌ర్ ఏప్రిల్ 12న విడుద‌ల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్ర‌క‌టించారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఏప్రిల్24న జ‌ర‌గ‌బోతున్న‌ట్లు వెల్లడించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తులో జరగనుండగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిలుగా పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్‌లు రానున్న‌ట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానున్నట్లు తెలుస్తోంది.