మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’(Acharya) ఇందులో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రామ్‌చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించారు.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి చిత్రబృందం ఒక క్రేజీ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా మేకర్స్ ఈ బిగ్ అప్ డేట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. నెలలోనే ఆచార్య మూవీ విడుదల కానుండడంతో చిత్రబృందం వరుస అప్‌డేట్స్ ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీరామనవమి నుంచే వాటికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. కాగా, ‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 29న విడుదల కానుంది.