సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్‌, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. మ్యూజిక్‌ సెన్సెషన్‌ తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా బ్యాంక్ మోసాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని మే 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్రబృందం స‌న్నాహాలు చేస్తున్నారు.

అయితే, మార్చి 20వ తేదీన ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ‘ఎవ్రీ ఎవ్రీ పెన్ని..’ అంటూ సాగే ఈ సాంగ్ లో మహేశ్‌ బాబు , ఆయన కుమార్తె సితార, సంగీత దర్శకుడు థమన్ సూపర్ స్టెప్పులతో అలరించారు. అయితే తాజాగా యూట్యూబ్‌లో ఈ పాటను ఇప్ప‌టివ‌ర‌కు 20 మిలియన్ల మంది చూశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోనే హైయెస్ట్ ఫాస్ట్ వ్యూవుడ్ లిరిక‌ల్ సాంగ్‌గా పెన్ని సాంగ్ రికార్డు సాధించింది.