మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్‌(Shankar) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ పాట‌, ఫైట్ చిత్రీక‌రణ కోసం దర్శకుడు శంకర్ రూ.20 కోట్లు ఖ‌ర్చుపెట్టాడ‌ని సమాచారం. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే ఓ సాంగ్ ను రామోజీఫిలింసిటీలో చిత్రీకరించగా.. దానికోసం రూ.9కోట్లు ఖ‌ర్చుపెట్టాడ‌ట శంక‌ర్. అలాగే మరో రాష్ట్రంలో ఓ ఫైట్ సీన్ కోసం శంక‌ర్ రూ.10 కోట్లు ఖ‌ర్చుపెట్టిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ఈ మూవీలో రాంచ‌ర‌ణ్ రెండు విభిన్న పాత్రల్ల క‌నిపించ‌నున్నట్లు సమాచారం. అందులో ఒకటి స్టూడెంట్‌ పాత్ర కాగా, మరొకటి ప్ర‌భుత్వ ఉద్యోగి పాత్ర అన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ అమృత్‌సర్‌లో మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షెడ్యూల్‌ కోసం అమృత్‌సర్‌లోని లొకేషన్స్‌ను చిత్రబృందం పరిశీలించి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో సునీల్, నవీన్‌ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.