పంజాబ్ సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ సూపర్ కింగ్స్ 151 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.

పంజాబ్ సూపర్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.  లివింగ్ స్టోన్ చెలరేగి పోయాడు.  కేవలం 33 బంతుల్లో 60 పరుగులు చేశాడు.  షారుఖ్ ఖాన్ 26 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో ముగ్గురు బ్యాట్స్ మన్ డక్ అవుట్ అయ్యారు. 

సన్ రైజర్స్, హైదరాబాద్ బౌలర్ల లో భువనేశ్వర్ కుమార్ టాప్ ఆర్డర్ మూడు వికెట్లు తీయగా, ఆఖరి ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ ఒక్క పరుగు ఇవ్వకుండా నాలుగు వికెట్లు తీశాడు నటరాజన్, సుచిత్ చెరో వికెట్ తీశారు.

అనంతరం 152 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్, హైదరాబాద్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తరగిలింది. 14 పరుగుల వద్ద కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్ ను రబాడ బౌలింగ్ లో కోల్పోయింది.  అభిషేక్ శర్మ 31 పరుగులు చేసి చాహర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.  రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 34 పరుగులు చేసి చాహర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

అయితే ఆ తర్వాత మార్క్రమ్, పూరన్ మరో వికెట్ పడకుండా, సన్ రైజర్స్ హైదరాబాద్ ను గెలిపించారు. మార్క్రమ్ 27 బంతుల్లో 41 పరుగులు, పూరన్ 30 బంతుల్లో 35 పరుగులు చేసి అజేయం గా నిలిచారు.