కన్నడ అగ్ర కథానాయకుడు యశ్‌(Yash) హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2). కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించగా.. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అలాగే బాలీవుడ్‌ సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘కేజీఎఫ్​-2’ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.

ఇక తొలి ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.623. 80 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించ‌టం విశేషం. ఇక ఈ సినిమా
తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల‌కు కలిపి రూ. 58.66 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ (రూ.93 కోట్లు గ్రాస్) రాబట్టింది. ఇక ఐదో రోజున ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.5.10 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే “కేజీఎఫ్‌-2″సినిమాకు మొత్తంగా హిందీ,రెస్టాఫ్ ఆఫ్ ఇండియాలో రూ.256 కోట్లు వసూలు చేయగా, ఓవ‌ర్‌సీస్ లో రూ.104.20 కోట్లు, క‌ర్ణాట‌కలో రూ. 100.60 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 93.00 కోట్ల గ్రాస్, త‌మిళ‌నాడులో రూ.32.25 కోట్లు, కేర‌ళలో రూ. 33.75 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా KGF 2 సినిమా విడుదలైన 5 రోజుల్లో రూ.623.80 కోట్లు సాధించింది