మాస్‌ మహారాజా రవితేజ(Ravi Teja) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. (Tiger Nageswara Rao) తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించారు. ఆ రోజు మ‌ధ్యాహ్నం 12:06 గంట‌ల‌కు స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను కూడా విడుదల చేయ‌నున్నారు. కాగా, స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. రవితేజ కెరీర్‌లో అత్యంత భారీ స్థాయిలో రూపొందబోతుంది.

అయితే ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మాల‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య‌ అతిథిగా రానున్న‌ట్లు తాజాగా చిత్రయూనిట్ ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో ర‌వితేజ‌కు జోడిగా నుపుర్ స‌న‌న్‌, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్‌లు క‌హీరోయిన్లుగాన‌టిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి జీవీప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.