మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా దిగ్గజ దర్శకుసు శంకర్‌(Shankar) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సునీల్, నవీన్‌ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాలో ఒక విలన్ గా టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరో విలన్ కూడా ఈ సినిమాలో చేరబోతున్నట్లు సమాచారం. సీనియర్ హీరో అరవింద్ స్వామి కూడా ఈ చిత్రాల్లో మెయిన్ విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.
చాలా కాలం తరువాత డైరెక్టర్ శంకర్ పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ నరేట్ చేయబోతున్నాడని,ఈ సినిమాలో అరవింద్ స్వామి పొలిటీషియన్ పాత్రలో నటిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది