1980-90ల జమ్మూకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాల ఆధారంగా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం “ది కశ్మీర్‌ ఫైల్స్‌” (The Kashmir Files) మార్చి 11న విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కెలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సఫీసు వద్ద పెను ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్‌ నటులు అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి, నటి పల్లవి జోషిలు ప్రధాన పాత్రలు పోషించారు.

అయితే తాజాగా “ది కశ్మీర్‌ ఫైల్స్‌” మూవీ బాక్సాఫీస్ వద్ద మూడు వారాల్లోనే రూ.234.03 కోట్ల మేర కలెక్షన్లు వాసులు చేసింది. ఓవర్సీస్‌ కలెక్షన్లతో కలుపుకొని మొత్తం ప్రపంచ్యాప్తంగా రూ.301 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలోనే కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీ సల్మాన్‌ ఖాన్‌ ‘రేస్‌ 3’, అక్షయ్‌ కుమార్‌ ‘సూర్యవంశీ’ సినిమాల కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసి రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే బాక్సాఫీస్ వద్ద మరికొన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా, ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. ఇప్ప‌టికే అందుకు సంబందించిన డ‌బ్బింగ్ ప‌నులు కూడా ప్రారంభ‌మైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెల రెండో వారంలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు చిత్ర బృందం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌తో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వినోదపు పన్నును మినహాయించిన విషయం తెలిసిందే.