యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌(Prabhas), బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్‌’(Radhe Shyam). జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించగా.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించింది. ఈ సినిమాకు దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా, తమన్ నేపథ్య సంగీతం అందించాడు.

అయితే మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిశ్రమ స్పందనలను అందుకుంది.
తాజాగా ఈ అంశంపై దర్శకుడు రాధాకృష్ణ స్పందించారు. ‘రాధేశ్యామ్’​ సినిమాపై నెగెటివిటీ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. కానీ, విడుదలై రోజులు గడుస్తున్న కొద్దీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రభాస్‌ను కలవలేదు. కానీ సమయం దొరికినప్పుడు మాత్రం మెస్సేజ్‌లు చేసుకుంటున్నాం. తొలి మూడు రోజులు నా ఇమేజ్‌ సినిమాని డామినేట్‌ చేసేస్తుంది అని ప్రభాస్‌ నాతో చాలా సార్లు అన్నాడు అని రాధాకృష్ణ కుమార్‌ చెప్పుకొచ్చారు