మెగాస్టార్‌ చిరంజీవి ( Chiranjeevi ) కథానాయకుడుగా డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య'(Acharya). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్‌ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్‌ ముఖ్య పాత్ర పోషించాడు. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదల విడుదల చేయనున్నారు చిత్రబృందం. థియేటర్స్ లో ఆచార్య ట్రైలర్ ను 5 గంటల 49 నిమిషాలకు రిలీజ్ చేయనుండగా.. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ని సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకి విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆచార్య ట్రైలర్ రన్ టైమ్ 2 నిమిషాల 35 సెకన్లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 150 కి పైగా థియేటర్లలో ఈరోజు ట్రైలర్ కూడా విడుదల కానుంది.