మెగాస్టార్‌ చిరంజీవి ( Chiranjeevi ) కథానాయకుడుగా డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య'(Acharya). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్‌ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్‌ ముఖ్య పాత్ర పోషించాడు. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 13 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సీన్స్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందిస్తోంది. అలాగే ఈ ట్రైలర్‌ చూస్తుంటే ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగేలా ఉ‍న్నాయి. ఇదిలావుంటే, తాజా సమాచారం ప్రకారం ఆచార్య మూవీ నుంచి రెండో ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తొలుత రిలీజ్ చేసిన ట్రైలర్ పక్కా మాస్ గా ఉండగా రెండో ట్రైలర్ మాత్రం ఫుల్ ఎమోషనల్ గా ఉండనుందట. ఈ ట్రైలర్ ను సినిమా విడుదలకు వారం రోజుల ముందు రావచ్చని రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.