కన్నడ స్టార్ హీరో యశ్‌(Yash) కథానాయకుడుగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2). నాలుగేళ్ళ కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందింది.హోంబలే ఫిలింస్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. విలన్‌ అధీరా పాత్రను ప్రముఖ బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ పోషించాడు.

అయితే ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘కేజీఎఫ్​-2’ మూవీ బాక్సాఫీస్​ దుమ్ముదులుపుతూ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి రెండు రోజుల్లోనే దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మూడో రోజు కూడా 100 కోట్ల‌కు పైగా వసూళ్లు సాధించింది. మొత్తంగా విడుదలైన మూడు రోజుల‌ల్లో కలిపి 450 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మూడోరోజు బాలీవుడ్‌లో రూ.48 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా క‌ర్ణాట‌క‌లో రూ.13.50 కోట్లు, తెలుగులో రూ.16 కోట్లు, త‌మిళ‌నాడులో రూ.8 కోట్లు, కేర‌ళ‌లో రూ.7 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.