మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’(Acharya) ఇందులో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రామ్‌చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించారు. ఇక ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్‌ 29న రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. దీనిపై అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు చేయనున్నట్టు ప్రకటించారు. కాగా, ‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 29న విడుదల కానుంది.