మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడుగా సీనియర్ డైరెక్టర్ శంకర్‌(Shankar) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్‌చరణ్‌ రెండు విభిన్న పాత్రల్లో క‌నిపించ‌నున్నట్లు సమాచారం. అందులో ఒకటి స్టూడెంట్‌ పాత్ర కాగా, మరొకటి ప్ర‌భుత్వ ఉద్యోగి పాత్ర అన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో సరికొత్త పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి స‌ర్కారోడు అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా నూతన షెడ్యూల్ ను ప్రారంభించారు చిత్రబృందం. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు(బుధవారం) అమృత్‌స‌ర్‌లో ప్రారంభమైంది. తాజా షెడ్యూల్‌లో రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వానీ, వెన్నెల కిశోర్‌, న‌వీన్ చంద్ర‌పై వ‌చ్చే సీన్ల‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 14వ‌ర‌కు ఈ షెడ్యూల్ కొన‌సాగనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో సునీల్, నవీన్‌ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.