పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌( Pawan Kalyan), యంగ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన చిత్రం “భీమ్లా నాయక్‌”( Bheemla Nayak). ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా, సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్‌ , సంయుక్త మీనన్‌ కథానాయికలుగా నటించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అలాగే “భీమ్లా నాయక్‌” సినిమా మార్చి 25న ఓటీటీ విడుద‌ల‌కు కూడా సిద్ధంగా ఉందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. మార్చి25న ఈ సినిమాని ఒకేసారి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఆ డేట్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుండగా.. తాజాగా భీమ్లా నాయక్ మూవీని మార్చి 24 నుంచే ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న రిలీజ్ కానుండడంతోనే భీమ్లా నాయక్ సినిమాను ముందే రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.