మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) కథనాయకుడుగా అగ్ర దర్శకుడు శంకర్‌(Shankar) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ రెండు విభిన్న పాత్రల్లో క‌నిపించ‌నున్నట్లు సమాచారం. అందులో ఒకటి స్టూడెంట్‌ పాత్ర కాగా, మరొకటి ప్ర‌భుత్వ ఉద్యోగి పాత్ర అన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో సరికొత్త పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ప్రస్తుతం అమృత్ సర్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై పలు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శంకర్. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా పంజాబ్ పోలీసులు రామ్ చరణ్ తో కలిసి ఫోటోలు దిగడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. కాగా, ఈ సినిమాకి స‌ర్కారోడు అనే టైటిల్‌ను చిత్రబృందం ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో సునీల్, నవీన్‌ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.