రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో, టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

బట్లర్ సెంచరీ మ్యాచ్ కి హైలైట్.  జైస్వాల్, పడిక్కల్ తొందరగానే అవుట్ అయ్యినా, బట్లర్ ధాటిగా ఆడుతూ సరిగ్గా 68 బంతుల్లో 100 పరుగులు (6×5 | 4×11) చేసి బుమ్రా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

ఆ తరువాత హేట్మెయిర్ 14 బంతుల్లో 35 పరుగులు, శాంసన్ 21 బంతుల్లో 30 పరుగులు చేసి రాణించారు.  మిగతా బ్యాట్సమెన్ ఎవరు కనీసం రెండంకెల స్కోరు చేయలేదు.

ముంబై ఇండియన్స్ బౌలర్ల లో బుమ్రా, మిల్స్ మూడేసి వికెట్లు తీశారు. పోలార్డ్ ఒక వికెట్ తీశాడు.

అనంతరం 194 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8  వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇషాన్ కిషన్ (54 పరుగులు) , తిలక్ వర్మ (61 పరుగులు ) అర్ధ సెంచరీల తో రాణించారు. తిలక్ వర్మ ధాటిగా ఆడి 33 బంతుల్లో 61 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది

రాజస్థాన్ రాయల్స్  బౌలర్ల లో సైని, చాహల్ తలా రెండు వికెట్లు తీయగా, అశ్విన్, ప్రసిద్ కృష్ణ, బౌల్ట్ తలా ఒక వికెట్ తీశారు.

ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ : బట్లర్