మెగాస్టార్‌ చిరంజీవి ( Chiranjeevi ) టైటిల్ పాత్రలో కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య'(Acharya). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లై ట్రైలర్, టీజ‌ర్ అభిమానుల్లో భారీ అంచ‌నాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా విడుద‌ల తేదీ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ క్ర‌మంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న హైద్రాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించ‌నున్నారని, ఈ వేడుకకి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి రానున్నారని సమాచారం.

నిజానికి ‘ఆచార్య’ మూవీ రిలీజ్ ఈవెంట్ ను తొలుత విజయవాడలో నిర్వహించాలని చిత్రబృందం భావించారు. కొన్ని అనివార్య కారణాల వల్లఏప్రిల్ 23న హైదరాబాద్‌లోనే ఈ వేడుక నిర్వహించాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ వేడుక కోసం యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్‌ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్‌ ముఖ్య పాత్ర పోషించాడు.