980-90ల జమ్మూకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాల ఆధారంగా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం “ది కశ్మీర్‌ ఫైల్స్‌” (The Kashmir Files) మార్చి 11న విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కెలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సఫీసు వద్ద పెను ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్‌ నటులు అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి, నటి పల్లవి జోషిలు ప్రధాన పాత్రలు పోషించారు.

అయితే తాజాగా “ది కశ్మీర్‌ ఫైల్స్‌” మూవీ బాక్సాఫీస్ వద్ద 210 కోట్ల మైలురాయిని చేరుకుంది. శుక్రవారం ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమా విడుదలైనా కూడా ఈ మూవీ చక్కటి కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల మార్కును చేరుకోవడం ల్ ఖాయంగా కనిపిస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. ఇప్ప‌టికే అందుకు సంబందించిన డ‌బ్బింగ్ ప‌నులు కూడా ప్రారంభ‌మైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెల రెండో వారంలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు చిత్ర బృందం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌తో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వినోదపు పన్నును మినహాయించిన విషయం తెలిసిందే.