క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun) కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘పుష్ప’.(Pushpa) గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈమూవీ క్రేజ్‌ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్‌గా పుష్ప: ది రూలర్‌ పార్ట్‌ 2 ప్రస్తుతం రూపొందుతోన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా(Rashmika Mandanna) నటించింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. పుష్ప‌ 2(Pushpa 2) పార్ట్ చిత్రీకరణ కోసం చిత్రబృందం కొత్త వ్యూహం ఫాలో కానున్నట్లు తెలుస్తోంది. ఇన్నిరోజుల వరకు ఏప్రిల్ రెండో వారం నుంచి పుష్ప‌ 2 షూటింగ్ మొద‌లుకానున్న‌ట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో కాకుండా జూన్ నెల తొలి వారంలో ప్రారంభించాలని చిత్ర యూనిట్ యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబ‌ర్ లో కాకుండా వచ్చే ఏడాది విడుదల చేయాలని సుకుమార్ అండ్ కో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు.