తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. యద్రాదిలో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు.తెలంగాణ అభివృద్ధి గురించి, ఉద్యోగుల వేతనాల పెంపు గురించి KCR మాట్లాడారు.ప్రస్తుతం ఉన్న వేతనాలకు అధికంగా జాబ్ చేసే వారికి జీతాలు పెంచుతాం అని హామీ ఇచ్చారు.భువనగిరిని జిల్లాగా మార్చి ఊహించని స్థాయిలో కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేసిన అధికారులకు , నాయకులకు ,జిల్లా ప్రజలకు kcr అభినందించారు.త్వరలోనే ఉద్యోగులకి జీతాలు పెంచుతూ జీవో తెస్తామని kcr తెలిపారు.యద్రాది గుడి కంప్లీట్ అయితే ప్రాంత అభివృద్ధి మరింత ఎక్కువ ఉంటాదని తెలిపారు. ఇక జీతాల పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకి kcr చెప్పిన మాటలు సంతోష పడేలా ఉన్నాయి.ఉద్యోగులు కూడా ఇంకో గంట అధికంగా పని చేసి అభివృద్ధికి సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉందని cm kcr తెలిపారు.