ఐపీల్ వేలంలో అనుకోని సంఘటన జరిగింది.దేసి, విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ప్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. ఇక వేలం వేసే సమయంలో అందరికి షాక్ ఇచ్చే సంఘటన జరిగింది.Ipl వేలం నిర్వహకుడు హ్యూ ఎడ్మీడ్స్ డయాస్ దగ్గర ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.ఇప్పటి వరకు జరిగిన వేలంలో అందరిని అలరించి వేలం నిర్వహించిన హ్యూ ఎడ్మీడ్స్ క్రికెటర్ వనిందు హసరంగని వేలం వేసే సమయంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో మెగా వేలం ప్రస్తుతానికి నిలిచి పోయింది.ఇక ఇప్పటి వరకు జరిగిన వేలంలో Indian Players అత్యధిక ధర పలుకుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. నిర్వాహకుడు కొలుకోగానే మళ్ళీ మెగా వేలం ప్రారంభం అవుతుంది.