పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) , రానా దగ్గుబాటి (Rana Daggubati )హీరోలుగా మరి కొన్ని గంటల్లో రాబోతున్న సినిమా భీమ్లానాయక్( Bheemla Nayak ). సాగర్ కే చంద్ర (Sagar k Chandra )దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)మాటల సహకారం అందించారు. తమన్(S Thaman ) సంగీతం సమకూర్చారు. ఇక భీమ్లానాయక్ అంగరంగవైభవంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం తెలంగాణ మంత్రి KTR సంమక్షంలో నిర్వహించారు.

ఇక భీంలా నాయక్ ap గవర్నమెంట్ షాక్ ఇచ్చింది. ఆద్రప్రదేశ్ (AP )లో స్పెషల్ షోలు వేయకూడదని థియేటర్స్ వారికి ముందస్తు నోటిఫికేషన్ జారీ చేసారు. ఎవరైన నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే సినిమాటోగ్రాఫ్ 1952 చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

రెవిన్యూ అధికారులు థియేటర్స్ పై నిఘా పెట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లావారిగా తహసిల్దార్ కార్యలయాలకు నోటిసులు పంపించారు. భీమ్లానాయక్(Bheemla Nayak ) రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. జగన్ ప్రభుత్వం మీద పవన్ అభిమానులు మండి పడుతున్నారు.