యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన మరో పాన్‌ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’.పూజ హెగ్డే హీరోయిన్‌. కె. రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్‌, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్‌ ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. జస్టిన్‌ ప్రభాకరన్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.

మొత్తానికి వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా రాధేశ్యామ్‌ కొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది. “మనం ఆలోచిస్తున్నాం అని భ్రమపడుతుంటాం.. కానీ మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయ్” అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఆదరగొట్టింది. అలాగే చేయి చూసి ఫ్యూచర్‌ని, వాయిస్‌ విని పాస్ట్‌ని కూడా చెప్పేస్తావా అని ప్రభాస్‌ని అడగ్గా.. ‘విని ఎలా ఎప్పుడు చనిపోతాడో చెప్పనా ’అని ప్రభాస్‌ జవాబిచ్చాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ సినిమా ట్రైలర్ మీరు చూసేయండి.