యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీ స్టారర్‌ చిత్రం “రౌద్రం.. రణం.. రుధిరం” (ఆర్‌ఆర్‌ఆర్‌) దర్శకదీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (Rajmouli)దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు.

కాగా, ఈ మోస్ట్​ అవేయిటెడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రకు సంబంధించి 36 సెకన్ల రన్ టైం ఉన్న ఓ కీలక సన్నివేశాన్ని రాజమౌళి తొలగించినట్లు సమాచారం. ఇప్పటికే మూవీ రన్ టైం ఎక్కువ కావడంతో జక్కన్న ఆ సన్నివేశాన్ని తొలగించి సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత కలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.