Aadavallu Meeku Joharlu: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ తొలి రోజు నైజాం కలెక్షన్ల వివరాలివే!

యువ హీరో శర్వానంద్(Sharwanand), టాలెంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna), జంటగా నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavallu Meeku Joharlu) దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala) తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్(Sri Lakshmi Venkateswara Cinemas) పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

మార్చి 4న విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి తొలి రోజు నైజాం కలెక్షన్ల వివరాలెలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 80 లక్షల షేర్ వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులో ఇవి మంచి కలెక్షన్లు అనే చెప్పొచ్చు. అలాగే ఈ వీకెండ్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు .