కన్నడ స్టార్ హీరో యశ్ కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “కేజీఎఫ్-2”. నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.
తాజాగా ‘కేజీఎఫ్-2’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ను సాధించింది. అలాగే ఈ సినిమా రన్ టైమేనను 2 గంటల 18 నిమిషాలుగా లాక్ చేశారు మేకర్స్. ఇది డీసెంట్ రన్ టైం అని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు చక్కటి స్పందన లభించింది. భారత సినీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్గా రికార్డులను ఖాతాలో వేసుకుంది. కాగా, ఈ మూవీలో సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్, రవీనా టండన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు.
Recent Comment